సాక్షి, విశాఖపట్నం : విశాఖ జూ లోకి రాయల్ బెంగాల్ టైగర్ ప్రవేశించింది. బిలాస్పూర్ జూ నుంచి ఆడ రాయల్ బెంగాల్ టైగర్ రైలులో గురువారం విశాఖ జూ కి చేరుకుంది. అనంతరం జూ క్యూరేటర్ యశోద బాయి పులిని పరిశీలించారు. ఏడాది వయస్సున్న ఆడ పులికి జూ అధికారులు దుర్గగా నామకరణం చేశారు. ఆడపులికి విశాఖ జూ పూర్తిగా కొత్తది కావటంతో అలవాటు పడటానికి ప్రత్యేక రక్షణలో ఉంచారు. ఆడ పులిని పంపినందుకు బదులుగా రెండు జతల నక్షత్ర తాబేళ్లను విశాఖ జూ అధికారులు బిలాస్పూర్ జూకు పంపారు.