బాబు ప్రయోజనాల కోసమే ఆయన పనిచేశారు..

9 Feb, 2020 15:46 IST|Sakshi

సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్‌

సాక్షి, అమరావతి: ప్రజల రక్షణ కోసం కాకుండా చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏబీవీ రావు సెస్పెండ్‌పై ట్విట్టర్‌ వేదికగా సజ్జల స్పందించారు. వైఎస్సార్‌సీపీని దెబ్బతీయడానికి నిఘా వ్యవస్థను ఉపయోగించారని.. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలులో దళారీగా పనిచేశారన్నారు. పరికరాలు కొని తనతో సహా మా నాయకుల ఫోన్లన్నింటినీ అక్రమంగా ట్యాప్‌ చేశారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఒక మాఫియానే నడిపారని తెలిపారు. ఏబీవీ అక్రమాలను ఎంపీ కేశినేని నాని పరోక్షంగా అంగీకరించారని సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు