‘సాక్షి’ గ్రూప్, భాష్యం ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్

23 Apr, 2015 02:02 IST|Sakshi
‘సాక్షి’ గ్రూప్, భాష్యం ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్

హైదరాబాద్: పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడం కోసం, మరింత మెరుగుపెట్టడం కోసం సాక్షి మీడియా గ్రూప్, భాష్యం విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం కాబోతోంది. యోగా, చెస్, పెయింటింగ్, వెస్ట్రన్ డ్యాన్స్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కలినరీ, పియానో, గిటార్ తదితర అంశాల్లో ఈ శిక్షణ జరగనుంది.

భాష్యం పబ్లిక్ స్కూల్స్‌లో మే 3వ తేదీ వరకు రెండు పాస్‌పోర్టు ఫొటోలు, వివరాలతో వీటికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మే 4 నుంచి 30వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ శిక్షణ ఉంటుంది. వివరాలకు 04023256138లో సంప్రదించవచ్చు.
 

మరిన్ని వార్తలు