సాక్షి, హైదరాబాద్ : దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన కర్ణాటక సంక్షోభం ముగిసింది. విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ కుప్పకూలిన సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్, ఆయన సతీమణి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ దంపతులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మంగళవారం ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకుల్లో కోహ్లి 922 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 913 పాయింట్లతో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..