హైదరాబాద్: బల్కంపేట డివిజన్ బాపూనగర్కు చెందిన పోలీసు రిటైర్ ఏసీపీపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడేనికి చెందిన అత్తిలి లక్ష్మి బాపూనగర్లోని పోలీసు విభాగంలో పని చేసి రిటైర్ ఏసీపీ గులాబ్సింగ్కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకుని హాస్టల్ నడుపుతుంది.
కిరాయి కోసం వచ్చిన ప్రతిసారీ గులాబ్సింగ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రోజులు గడుస్తున్నా నిందితుడిపై చర్యలు తీసుకోవటం లేదని బాధితురాలు శుక్రవారం సోమాజీగూడ ప్రెస్క్లబ్కు వచ్చి విలేకరులకు తెలిపింది.తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది.