బహుదా నదిలో విద్యార్థి గల్లంతు

24 Nov, 2015 12:43 IST|Sakshi

నిమ్మనపల్లి: చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థి బహుదానదిలో గల్లంతయ్యాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న సోమశేఖర్ (16) గ్రామ సమీపంలోని వంతెనపై నుంచి వెళుతున్న సమయంలో బహుదా నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతడి కోసం స్థానికులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు