ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

20 Aug, 2018 11:58 IST|Sakshi

సాక్షి, విజయవాడ : మెడికల్ కౌన్సిలింగ్‌లో తమకు అన్యాయం జరుగుతోందంటూ విద్యార్థులు చేసిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు జరిగిన కౌన్సిలింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో విద్యార్థులు యూనివర్సిటీని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకు దిగిన  విద్యార్థులను పెనుమలూరు పోలీస్‌ స్టేషన్‌కు తరిలించారు. 

మరిన్ని వార్తలు