చిరంజీవిని గదిలో నిర్బంధించిన 'తమ్ముళ్లు'

19 Apr, 2014 14:10 IST|Sakshi

గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుతమ్ముళ్లు శనివారం ఘర్షణకు దిగారు. మంగళగిరి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా గంజి చిరంజీవిని టీడీపీ ఎంపిక చేసింది. అ క్రమంలో చిరంజీవికి బీ ఫారం అందజేశారు. ఆ స్థానం టికెట్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న పోతినేనికి తీవ్ర నిరాశ ఎదురైంది. దాంతో పోతినేనితో పాటు ఆయన అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

 

అయితే ఎన్నికలో తన గెలుపుకు కృషి చేయాలంటూ వచ్చిన చిరంజీవిపై పోతినేని వర్గీయులు దాడికి చేసి... అనంతరం చిరంజీవిని గదిలో నిర్బంధించారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. గంజి చిరంజీవి వర్గీయులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి చిరంజీవిని గది నుంచి బయటకు తీసుకువచ్చారు.

మరిన్ని వార్తలు