ఓటమి అంచున టీడీపీ అభ్యర్థి

25 Mar, 2015 20:05 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఉపాధ్యాయ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన చైతన్యరాజు ఓటమికి చేరువయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల  శాసనమండలి స్థానం నుంచి బరిలో దిగిన యూటీఎఫ్ అభ్యర్థి రామసూర్యారావు.. చైతన్య రాజు కంటే ముందజంలో కొనసాగుతున్నారు.

మొత్తం 17487 ఓట్లు ఉండగా తొలి ప్రాధాన్యత ఓట్లలో దాదాపు 14 వేల ఓట్లు లెక్కించారు. రామసూర్యారావుకు 7265 ఓట్లు రాగా, చైతన్య రాజుకు  5443 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో రామసూర్యారావు విజయానికి కేవలం 300 ఓట్ల దూరంలో ఉన్నారు.
 

మరిన్ని వార్తలు