కాశీపట్నం శివారులో వ్యక్తి దారుణ హత్య

12 Feb, 2016 12:05 IST|Sakshi

విశాఖపట్టణం జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నం శివారులో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు సత్యారావు(55) అనే వ్యక్తిని హతమార్చారు. అరటి తోటకు 20 వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి తలపై కర్రతో కొట్టారు. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. మృతునికి భార్య ఒక కుమారుడు ఉన్నారు. మడతునిది కాశీపట్నం సమీపంలోని జిన్నివలస గ్రామం.

 

మరిన్ని వార్తలు