నంద్యాల సాక్షి బృందం: నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్షో శుక్రవారం క్రాంతినగర్ నుంచి ప్రారంభమై పోలూరు వరకు కొనసాగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి ప్రారంభమై క్రాంతినగర్, చాపిరేవుల, పాండురంగాపురం, ఊడుమాల్పురం, పోలూరు వరకు రోడ్షో సాగుతుందన్నారు.