తిరుమల: తిరుమలలో ఆర్టీసీ సమ్మె ప్రభావం కనిపిస్తోంది. శుక్రవారం భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో కొనసాగింది. సమ్మెనుంచి తిరుమల డిపోకు మినహాయింపు ఇవ్వడంతో 110 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. ఇతర డిపోల నుంచి రావాల్సిన మరో 350 బస్సులు రావడం లేదు.
శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 42,134 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 5 కంపార్ట్మెంట్లలో కాలిబాట భక్తులు వేచి ఉన్నారు.