ఎక్సైజ్ పాలసీపై చంద్రబాబు సమీక్ష

22 Jun, 2015 13:32 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. వేలం ధర, షాపుల కేటాయింపులు, లీజు ధరలు పాత విధానం ప్రకారమే ఉండాలని నిర్ణయించారు. ఏపీలో మొత్తం ఏడు వేలకు పైగా షాపులకు వేలం నిర్వహించనున్నారు. గత ఏడాది ఆదాయం కంటే ఈ ఏడాది అదనంగా 10 శాతం సమకూర్చుకోవాలని ఎక్సైజ్ శాఖ ఈ సమీక్షలో నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు