ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల

25 May, 2015 12:58 IST|Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ట్రిపుల్ ఐటీల ప్రవేశానికి సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్‌జేయూకేటీ (రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక యూనివర్సిటీ  వైస్ చాన్సులర్ సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. హైదరాబాద్, బాసర, ఇడుపులపాయ, నూజివీడులో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.విద్యార్థులకు దరఖాస్తులు ఆన్లైన్లో లభ్యం అవుతాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 19వ తేదీ.  రెండు రాష్ట్రాల్లో 85 శాతం స్థానికత, 15 శాతం ఓపెన్ కేటగిరి ద్వారా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
 

మరిన్ని వార్తలు