హథీరాంజీ మఠంలో పెళ్లిళ్లపై విచారణ: టీటీడీ ఈవో

6 Mar, 2015 23:36 IST|Sakshi

తిరుమల: తిరుమలలోని హథీరాంజీ మఠంలో ఇటీవల ‘మరుమాంగళ్యం’ పేరుతో నిర్వహించిన పెళ్లిళ్లపై విచారణ చేయిస్తామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు తెలిపారు. వివాహాలు అయిన జంటలకే తిరిగి పెళ్లిళ్లు చేసినట్టు విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈవో పైవిధంగా బదులిచ్చారు. మరుమాంగళ్యం పేరుతో వివాహాలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.

 

ఇందులో వాస్తవ పరిస్థితులు ఏమిటి? భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా? అన్న విషయాలపై ఆరా తీస్తామన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు