తొలి సంతకానికి చంద్రబాబు విలువ తీసేశారు..

21 Jul, 2014 20:07 IST|Sakshi
తొలి సంతకానికి చంద్రబాబు విలువ తీసేశారు..
గుంటూరు: కోటయ్య కమిటీ నివేదిక రుణమాఫీని నీరుగార్చేలా ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రుణమాఫీపై  కోటయ్య ఇచ్చిన రిపోర్టు కాదు.. అది టీడీపీ నేతలు రాయించిన కోటయ్యకు ఇచ్చిన రిపోర్టు మాత్రమేనని ఉమారెడ్డి అన్నారు. 
 
అధికారంలోకి వచ్చిన తొలి సంతకానికి విలువ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన తీవ్రంగా స్పందించారు. బాగా పనిచేసే కార్పొరేషన్లను తాకట్టు పెట్టే యోచనను విరమించుకోవాలని చంద్రబాబుకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హితవు పలికారు. 
మరిన్ని వార్తలు