చంపి..కాఫీ తోటల్లో కాల్చేశారు

20 Feb, 2016 15:08 IST|Sakshi

అనంతగిరి(విశాఖపట్టణం): విశాఖ జిల్లా అనంతగిరి మండలం ఎగువపోచ పంచాయతీ గీసుపురం కాఫీ తోటల్లో ఓ వ్యక్తి మృతదేహం వెలుగుచూసింది. గుర్తు తెలియని వ్యక్తిని ఎక్కడో చంపేసి..రెండు రోజుల క్రితం కాఫీ తోటల్లో కాల్చేసి ఉంటారని భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు