బీసీల రాజ్యాధికారం కో్సం పోరాటం: కృష్ణయ్య

2 Oct, 2014 18:28 IST|Sakshi
బీసీల రాజ్యాధికారం కో్సం పోరాటం: కృష్ణయ్య
హైదరాబాద్: సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. వెనకబడిన తరగతుల విద్యార్ధుల, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. 
 
బీసీలకు రాజ్యాధికారం సాధించేంతవరకు పోరాటం చేస్తామని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చేసిన హామీలను నెరవేరేంతవరకు పోరాటం చేస్తామన్నారు. బీసీల అభ్యున్నతికి రాజీలేని పోరాటం చేస్తామని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. 
మరిన్ని వార్తలు