భార్యను కొట్టి చంపిన భర్త

21 Feb, 2015 08:58 IST|Sakshi

నెల్లూరు : నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను తీవ్రంగా కొట్టి చంపాడో భర్త. ఈ ఘటన పెల్లకూరు మండలంలోని అనకవోలు గ్రామంలో జరిగింది. వివరాలు.... స్తానికంగా నివాసం ఉండే గురవయ్య తన భార్య రత్తమ్మ(35) ను శుక్రవారం అర్థరాత్రి దారుణంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

అనంతరం భార్య మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందింతుడి కోసం గాలింపు ప్రారంభించారు.
(పెల్లకూరు)

మరిన్ని వార్తలు