'వైఎస్ జగన్ను సీఎం చేయడమే ధ్యేయం'

3 Apr, 2014 14:15 IST|Sakshi
'వైఎస్ జగన్ను సీఎం చేయడమే ధ్యేయం'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తమ ధ్యేయమని ఆ పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. గురువారం విశాఖపట్నంలో స్థానిక మాజీ కార్పొరేటర్ పీ ఎల్ ఎన్ పట్నాయిక్ తన అనుచరులతో కలసి కొణతాల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 

ఈ సందర్బంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయిన వైఎస్ఆర్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఎవరు ఎన్ని దుష్పచారాలు చేసినా...  ప్రజల ఆశీస్సులతో రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 

>
మరిన్ని వార్తలు