'అక్కడే ఏపీ రాజధాని నిర్మించాలి'

15 Jul, 2014 13:22 IST|Sakshi
'అక్కడే ఏపీ రాజధాని నిర్మించాలి'

హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధానిని ఏర్పాటు చేయాల్సిందేనని మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ అన్నారు. ప్రజలకు దూరంగా పాలన అంటే అది వలస ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ శాఖలన్నీ గుంటూరు - విజయవాడ మధ్యే ఉన్నాయి కాబట్టి అక్కడే ఏపీ రాజధాని నిర్మించాలని సూచించారు.

రాజధాని ఏర్పాటుకు కావలసిన మౌలిక వసతులన్నీ అక్కడ ఉన్నాయని చెప్పారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లను ప్రోత్సహించేందుకే రాజధాని నిర్మాణం ఇక్కడా..అక్కడా అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు