వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభం

18 Jul, 2015 10:53 IST|Sakshi
వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభం

అనంతపురం : అన్నదాతల్లో భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి అనంతపురం జిల్లాలో 'రైతు భరోసా యాత్ర'ను ప్రారంభించారు.  ఆయన ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు.  బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద చేరుకున్న వైఎస్ జగన్కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

 

లేపాక్షి మండలంలోని మామిడిమాకులపల్లిలో వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్న వెనుకబడిన వర్గాలకు చెందిన రైతు కురుబ సిద్ధప్ప కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. అనంతరం అక్కడినుంచి హిందూపురానికి చేరుకుంటారు. సాయంత్రం 5గంటలకు హిందూపురంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. తర్వాత పుట్టపర్తి నియోజకవర్గంలోని చెన్నకేశవపురంలో రాత్రికి బస చేస్తారు.

మరిన్ని వార్తలు