నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌

14 May, 2019 08:43 IST|Sakshi

సాక్షి, పులివెందుల : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రికి హైదరాబాద్‌ నుంచి పులివెందులకు చేరుకుంటారని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 8.30గంటలకు తమ క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజలతో మమేకమవుతారు. సాయంత్రం పులివెందుల పట్టణంలోని వీజే ఫంక్షన్‌ హాలులో ముస్లింలతో కలిసి ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు. 16వ తేదీ (గురువారం) ఉదయం నుంచి తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన వివరించారు.  

>
మరిన్ని వార్తలు