సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల ఐదో తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలసి ఈ నెల 15వ తేదీన రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా కోరనున్నారు. వీరిద్దరి మధ్య జరిగే సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు, కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న వివిధ అంశాలు చర్చకు రానున్నాయి. ఈ మేరకు సీఎం కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.