16న గుంటూరులో వైఎస్ జగన్ యువభేరి

12 Feb, 2017 16:16 IST|Sakshi
16న గుంటూరులో వైఎస్ జగన్ యువభేరి

గుంటూరు:
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని వైఎస్‌ఆర్సీపీ నేతలు ఆదివారం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 16న గుంటూరులో పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో యువభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువభేరి ద్వారా చంద్రబాబు మోసపూరిత విధానాలను ప్రజలకు వివరిస్తామని నేతలు మర్రి రాజశేఖర్‌, లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేసిన నల్లపాడులోనే యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్‌ఆర్సీపీ నేతలు వెల్లడించారు. యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యువభేరిని విజయవంతం చేయాలని మర్రి రాజశేఖర్‌, లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.  

మరిన్ని వార్తలు