ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించిన విజయమ్మ

2 Jul, 2013 12:59 IST|Sakshi
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించిన విజయమ్మ

ఆదిలాబాద్ : వైఎస్ రాజశేఖరరెడ్డి తన తన హయాంలో ఒక్క పైసా పన్నులు వేయలేదని.... డజన్లకొద్ది సంక్షేమ పథకాలను అందించారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా గుండంపల్లి హైలెవల్‌ పనులతో పాటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ పనులను ఆమె మంగళవారం పరిశీలించారు.

అక్కడ వైఎస్‌ శంకుస్థాపన చేసిన శిలాపలకానికి పాలతో అభిషేకం చేశారు. అనంతరం వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ జెండాను విజయమ్మ ఆవిష్కరించారు. వైఎస్‌ఆర్‌ వృద్దులకు, వికలాంగులకు పెన్షలు, పేదలకు ఇండ్లు కట్టించారని చెప్పారు. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకం ప్రవేశవెట్టలేదని అన్నారు. త్వరలోనే జగన్‌ నాయకత్వంలో రాజన్న రాజ్యం వస్తుందని విజయమ్మ అన్నారు.

మరిన్ని వార్తలు