ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ సీపీదే విజయం

6 Jul, 2013 11:43 IST|Sakshi
ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ సీపీదే విజయం

హైదరాబాద్ : రాష్ట్రంలో  ఏ ఎన్నికలు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. గుర్తులు లేని పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎవరు గెలిచినా తమ ఖాతాలో వేసుకోవచ్చన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆమె వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేవరకూ జగన్మోహన్ రెడ్డిని జైల్లోనే ఉంచాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఢిల్లీలో చెప్పుకున్నట్లు సమాచారం ఉందని విజయమ్మ  'సాక్షి' ఇంటర్వ్యూలో తెలిపారు.

జగన్ బయటకొచ్చేలోపు కాంగ్రెస్ను బలోపేతం చేసుకుంటామని ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పుకొచ్చారనే సమాచారం ఉందన్నారు. తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేషమైన ప్రజాదరణ ఉందని విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ అభివృద్ధికి చేసిన కృషి మాటల్లో చెప్పలేమన్నారు.

వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఎక్కువగా లబ్ది పొందింది తెలంగాణ ప్రజలేనని విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను జగన్ తప్పక నెరవేరుస్తాడని విజయమ్మ తెలిపారు. కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. ఇప్పటికీ  రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలోనే ఉందని విజయమ్మ వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు