చంద్రబాబు మహిళా ద్రోహి: రోజా

11 Mar, 2015 02:13 IST|Sakshi
చంద్రబాబు మహిళా ద్రోహి: రోజా

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహిళా ద్రోహి అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఉప్పులేటి కల్పనలతో కలిసి ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. చంద్రబాబు వైఖరి ‘పాము తన పిల్లల్ని తానే తింటుందన్నట్టుగా ఉంది’ అని ధ్వజమెత్తారు.

మహిళా ఓట్ల కోసం ఎన్నికల్లో గెలిస్తే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారని, గెలిచిన తర్వాత ఆ సంగతినే పట్టించుకోవడంలేదని అన్నారు. డ్వాక్రా రుణాల మాఫీపై సభలో చర్చించాలని కోరితే ఇప్పడా ఆ అంశం అంత ముఖ్యమా అని అన్నారంటే.. ఆడపడచులంటే టీడీపీకి ఎంత చులకన భావం ఉందో స్పష్టమవుతోందని అన్నారు.
 
 

మరిన్ని వార్తలు