నెట్‌పై భారత్ వైఖరికి అమెరికా మద్దతు

27 Jun, 2015 01:04 IST|Sakshi
నెట్‌పై భారత్ వైఖరికి అమెరికా మద్దతు

న్యూఢిల్లీ : ఇంటర్నెట్ గవర్నెన్స్ విషయంలో ప్రపంచ దేశాల ప్రజలంతా కూడా పాలుపంచుకోవాలన్న భారత్ వైఖరిని అమెరికా సమర్థించింది. దీనిపై ఇరు దేశాల అభిప్రాయాలు ఒకటేనని అమెరికా రక్షణ శాఖ సహాయ మంత్రి క్యాథరిన్ ఎ నొవెలీ పేర్కొన్నారు. ఇటీవల అర్జెంటీనాలో జరిగిన ఐకాన్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఇంటర్నెట్ గవర్నెన్స్‌పై భారత్ సముచితంగా స్పందించిందని ఆమె తెలిపారు. కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కి పంపిన ఈమెయిల్‌లో నొవెలీ ఈ అంశాలు ప్రస్తావించారు. అంతర్జాతీయంగా ఇంటర్నెట్ నిబంధనలు, విధానాల రూపకల్పనలో ఐకాన్ కీలక పాత్ర పోషిస్తోంది.

మరిన్ని వార్తలు