న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సంస్థ భారత్లో మరి కొన్ని వారాల్లో నెక్సస్ 6 స్మార్ట్ఫోన్ను, నెక్సస్ 9 ట్యాబ్లను విడుదల చేయనున్నది. నెక్సస్ 6 స్మార్ట్ఫోన్ ధర రూ.44,000, నెక్సస్ 9 ట్యాబ్ ధర రూ.28,900గా ఉన్నాయి. నెక్సస్ 6 స్మార్ట్ఫోన్ను మోటోరోల, నెక్సస్ 9 ట్యాబ్ను తైవాన్కు చెందిన హెచ్టీసీ కంపెనీలు డెవలప్ చేశాయి.
అయితే వీటిని ఖచ్చితంగా ఎప్పుడు మార్కెట్లోకి తెచ్చేది గూగుల్ వెల్లడించలేదు. ఆండ్రాయిడ్ వన్ ఫోన్లకు మంచి స్పందన రావడంతో నెక్సస్ 6 స్మార్ట్ఫోన్ను, నెక్సస్ 9 ట్యాబ్లను గూగుల్ కంపెనీ భారత్లోకి తెస్తోంది. స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటైన భారత్లో చెప్పుకోదగ్గ మార్కెట్ వాటా సాధించడం కోసం గూగుల్, శామ్సంగ్ తదితర మొబైల్ కంపెనీలు భారత్పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి.
దీంట్లో భాగంగానే ఆండ్రాయిడ్ వన్ ఫోన్లను గూగుల్ సంస్థ మొదటగా భారత్లోనే అందించింది. మరిన్ని తాజా మోడళ్లను మొదటగా భారత్లోనే అందిస్తామని గూగుల్ అంటోంది. ఇక నెక్సస్ 6 స్మార్ట్ఫోన్లో 6 అంగుళాల డిస్ప్లే, ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి.