పాజిటివ్‌ ఆరంభం: టీసీఎస్‌ డౌన్‌

11 Jan, 2019 09:28 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి.  ఆరంభ లాభాలను మరింత పెంచుకుని సెన్సెక్స్‌ 100 పాయింట్లు ఎగిసి 36,207 వద్ద, నిప్టీ 27 పాయింట్లు లాభంతో 10848 వద్ద కొనసాగుతున్నాయి.  ఐటీ  తప్ప మిగలా అన్నీ లాభాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. 

ఫలితాల ప్రభావంతో టీసీఎస్‌  బాగా నష్టపోతోంది.  ఇంకా భారతి ఎయిర్‌టెల్‌, భారతి ఇన్‌ఫ్రాటెల​, టెక్‌మహ్రీంద,  శ్రీ సిమెంట్‌,  తదితరాలు నష్టపోతున్నాయి. మరోవైపు  టాటా  మోటార్స్‌, ఐటీసీ, ఎస్‌బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ,  హిందాల్కో, వేదాంతా ఓఎన్‌జీసీ, బీసీసీఎల్ లాభపడుతున్నాయి.  అయితే  ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌​  క్యూ3 నేడు  ఫలితాలను ప్రకటించనుంది.  
 

>
మరిన్ని వార్తలు