మాసెరటి ‘లెవాంటె’ వచ్చేసింది..

30 Jan, 2018 01:34 IST|Sakshi

ప్రారంభ ధర రూ.1.45 కోట్లు

న్యూఢిల్లీ: ఇటాలియన్‌ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మాసెరటి’ తాజాగా తన ప్రముఖ ప్రీమియం ఎస్‌యూవీ ‘లెవాంటె’లో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. దీని ప్రారంభ ధర రూ.1.45 కోట్లు (ఎక్స్‌షోరూమ్‌). ఇది గ్రాన్‌లుసో, గ్రాన్‌స్పోర్ట్‌ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ.1.48 కోట్లు, రూ.1.53 కోట్లుగా ఉన్నాయి. మాసెరటి నుంచి మన దేశంలోకి వస్తోన్న తొలి ఎస్‌యూవీ ఇదే.

మరిన్ని వార్తలు