న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ నికర లాభం ఈ ఏడాది డిసెంబర్ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రెండు రెట్లు పెరిగింది. గతేడాది క్యూ3లో రూ.2,729 కోట్లుగా ఉన్న నికర లాభం ఇపుడు రూ.6,677 కోట్లకు పెరిగిందని హెచ్డీఎఫ్సీ సీఈఓ కేకి మిస్త్రీ చెప్పారు.
హెచ్డీఎఫ్సీ మొత్తం ఆదాయం రూ.14,989 కోట్ల నుంచి రూ.16,847 కోట్లకు పెరిగింది.ఆర్థిక ఫలితాలు బాగుడటం, రూ.35,000 కోట్ల నిధుల సమీకరణకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలపడం వంటి సానుకూలాంశాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ షేర్ ఇంట్రాడేలో ఆల్ టైమ్ హై, రూ.1,982ను తాకింది. చివరకు 2.6 శాతం లాభంతో రూ.1,953 వద్ద ముగిసింది.