పేటీఎం ‘ప్రి–జీఎస్‌టీ’ సేల్‌

15 Jun, 2017 00:33 IST|Sakshi
పేటీఎం ‘ప్రి–జీఎస్‌టీ’ సేల్‌

న్యూఢిల్లీ: ఆన్‌లైట్‌ రిటైల్‌ సంస్థ ‘పేటీఎం’ తాజాగా ‘ప్రి–జీఎస్‌టీ’ పేరుతో ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్‌లో దాదాపు 6,000 మంది రిటైలర్లు 500కుపైగా బ్రాండ్లకు సంబంధించిన ప్రొడక్టులను విక్రయిస్తున్నారు. ‘ప్రి–జీఎస్‌టీ’ సేల్‌లో టీవీలు, ల్యాప్‌టాప్స్, మొబైల్‌ ఫోన్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫుట్‌వేర్, కెమెరాలు వంటి తదితర ప్రొడక్టులపై డిస్కౌంట్లను, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను పొందొచ్చు.

ఆఫ్‌లైన్‌ రిటైలర్లు ఈ సేల్‌లో పాల్గొనడం ద్వారా జీఎస్‌టీ అమలుకు ముందే వారి స్టాక్‌ను విక్రయించుకోవచ్చని పేటీఎం పేర్కొంది. ఆన్‌లైన్‌ డ్రగ్‌ మార్కెట్‌ప్లేస్‌ ‘1 ఎంజీ’ కూడా డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది స్టాక్‌ మెడిసిన్స్‌పై 20 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది.

>
మరిన్ని వార్తలు