ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో 27, 699 దగ్గర, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 8489 దగ్గర ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల సానుకూలంగా ఉండడంతో భారత మార్కెట్లు పాజిటివ్ గా వున్నాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో కొనుగోళ్ల ట్రెండ్ నెలకొంది. సోమవారం భారత సూచీలు 11 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ రోజుకూడా అదే ట్రెండ్ ను కొనసాగిస్తున్నాయి.
అటు డాలర్ తో పోలిస్తే రూపాయి మైనస్ లో ఉంది. 0.004 పైసల నష్టంతో 67.18 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. బంగారం ధర 29 రూపాయల నష్టంతో 31,549 దగ్గర ఉంది.