విదేశీ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా రూ.10,000 కోట్లకు పైగా (150 కోట్ల డాలర్లు) పెట్టుబడులు సమీకరించనున్నది. డాలర్ లేదా ఇతర కన్వర్టబుల్ కరెన్సీల్లో దీర్ఘకాల బాండ్ల జారీ ద్వారా ఈ స్థాయిలో నిధులను సమీకరిస్తామని బీఎస్ఈకి ఎస్బీఐ నివేదించింది. బుధవారం సమావేశమైన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఈ నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఒకేసారి గాని, వివిధ దఫాలుగా గానీ సమీకరిస్తామని పేర్కొంది. పబ్లిక్ ఆఫర్/డాలర్ లేదా ఇతర కన్వర్టబుల్ కరెన్సీల్లో ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో ఈ పెట్టుబడులను సమీకరిస్తామని ఎస్బీఐ వివరించింది.