లక్ష్యంలో 74 శాతానికి చేరిన ద్రవ్యలోటు

1 Dec, 2015 03:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో మొదటి ఏడు నెలలు గడిచేసరికి 74 శాతానికి చేరింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ ద్రవ్యలోటు 4.11 లక్షల కోట్లుగా నమోదయ్యింది.   ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5.55 లక్షల కోట్లు (మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో 3.9 శాతం) మించకూడదన్నది బడ్జెట్ లక్ష్యం.

మరిన్ని వార్తలు