శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు 

20 Jan, 2018 19:43 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పార్లమెంటరీ రాజ్యభాషా కమిటీలోని 32 మంది సభ్యులు, తమిళనాడు మంత్రి సంపత్‌, వెఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి దర్శించుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు ఇళయరాజా, సినీ నటుడు మురళీ శర్మ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు. 

>
మరిన్ని వార్తలు