తిరుపతిలో దారుణం.. డాక్టర్‌పై యాసిడ్‌ దాడి

7 Feb, 2019 11:59 IST|Sakshi

కోర్టు ప్రాంగణంలో దాడి చేసిన మహిళ

సాక్షి, తిరుపతి: తిరుపతి పట్టణంలో యాసిడ్‌ దాడి జరిగింది. తిరుపతి కోర్టు హాల్‌లో గురువారం ఓ డాక్టర్‌పై మహిళ యాసిడ్‌తో దాడి చేసింది. డాక్టర్‌ అప్రమత్తంగా ఉండటంతో ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

విడాకుల కేసు విచారణ నిమిత్తం ఆదర్శ్‌ రెడ్డి అనే డాక్టర్‌ గురువారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. బురఖా ధరించి వచ్చిన ఓ మహిళ కోర్టు ప్రాంగణంలో అతడిపై యాసిడ్‌తో దాడికి యత్నించింది. అప్రమత్తంగా ఉన్న ఆదర్శ్‌ రెడ్డి.. ఈ దాడి నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. దాడి అనంతరం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆమె ఆత్మాహత్యాయత్నం చేసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. దాడికి దిగిన మహిళ తిరుపతి నారాయణాద్రి ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.  తనను ప్రేమించి మోసం చేశాడని, అందుకే దాడి చేశానని సదరు మహిళ పోలీసులకు చెప్పినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు