దొంగనోట్ల కేసులో నిందితుడిపై కత్తులతో దాడి

6 Sep, 2018 08:56 IST|Sakshi

హైదరాబాద్‌: దొంగనోట్ల కేసులో ప్రధాన నిందితుడు ఎల్లంగౌడ్‌పై ప్రత్యర్థులు విచక్షణా రహితంగా దాడి చేసింది. కత్తులతో దాడిచేయడంతో ఎల్లంగౌడ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఎల్లంగౌడ్‌ను సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. 2014 సంవత్సరం శామీర్‌పేట్‌లో ఎల్లంగౌడ్‌ పోలీసులపై దాడి చేశాడు. ఈ సంఘటనలో ఈశ్వరయ్య అనే కానిస్టేబుల్‌ మృతిచెందగా..ఎస్‌ఐ వెంకట్‌ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి.

పోలీసు కాల్పుల్లో ఎల్లంగౌడ్‌ గ్యాంగ్‌ సభ్యుడు కూడా మృతిచెందాడు. అప్పటి నుంచి ఎల్లంగౌడ్‌ పరారీలో ఉన్నాడు. ఇటీవల ఎల్లంగౌడ్‌ను మహారాష్ట్రలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దాడి నేపథ్యంలో మరో మారు ఎల్లంగౌడ్‌ తెరపైకి వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు