హత్య చేశా..దమ్ముంటే పట్టుకో

26 Feb, 2019 11:22 IST|Sakshi

ఫోన్‌ చేసి వేధిస్తున్న సైకో  

కర్ణాటక, కృష్ణరాజపురం: పోలీస్‌స్టేషన్‌లోని ల్యాండ్‌లైన్‌ ఫోన్‌కు కాల్‌ చేసి మహిళా కానిస్టేబుల్‌ ను వేధిస్తున్న వ్యక్తిని సోమవారం బాగలకుంటె పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చిన రమేశ్‌ అనే వ్య క్తి చాలాకాలంగా బాగల్‌కుంటెలో ఉం టున్నాడు. మూడు నెలలుగా అక్కడి ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌ చేయడం, ఫోన్‌ తీసిన మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యంగా మాట్లాడడం పనిగా పెట్టుకున్నారు. హత్య చేశాను, వచ్చి అరెస్ట్‌ చేయం డి, అత్యాచారం చేశాను, దమ్మంటే పట్టుకోండి, ఒక్కోసారి నాకు సహక రించు..అని అతడు సైకో మాదిరిగా మహిళా పోలీస్‌ను సతాయిస్తున్నా డు.రోజురోజుకు వేధింపులు తీవ్రతరం కావడంతో పోలీసులు అతని ఫో న్‌ నంబర్, టవర్‌ లొకేషన్‌ ఆధారంగా రమేశ్‌ను గుర్తించి అరెస్ట్‌ చేశారు. 

>
మరిన్ని వార్తలు