దారుణం: పట్టపగలే కిడ్నాప్.. టీచర్‌ను వ్యాన్‌లో ఎక్కించి..

30 Nov, 2023 21:09 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకాలో పట్టపగలే దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ స్కూల్ టీచర్‌(23)ను దుండగులు కిడ్నాప్ చేశారు. ఎస్‌యూవీలో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు. 

అర్పిత(23) స్థానికంగా ఓ పాఠశాలలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. నేడు రాష్ట్రంలో స్కూళ్లకు సెలవు ఉన్న నేపథ్యంలో అర్పిత బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెను వెంబడించారు దుండగులు. వెనుక నుంచి నెమ్మదిగా వచ్చి అమాంతం ఒక్కసారిగా ఎస్‌యూవీలో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు. 

రాము అనే యువకుడే ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారని బాధిత యువతి తల్లి ఆరోపిస్తోంది. రాము, అర్పిత గత నాలుగు ఏళ్లుగా ప్రేమించుకున్నారని తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సెలవు రోజు అర్పిత ఇంటి నుంచి బయటకు ఎందుకు వెళ్లారు? ఇతర అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.          

ఇదీ చదవండి: రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి


 

మరిన్ని వార్తలు