ఇలా వచ్చి..అలా వెళ్లాడు..

13 Jan, 2020 07:24 IST|Sakshi
పప్పూ (ఫైల్‌)

రౌడీషీటర్‌ పప్పు అరెస్ట్‌

రెండు సార్లు పీడీ యాక్టు నమోదు

పలు స్టేషన్లలో 48 కేసులు

మల్కాజిగిరి: ఏకంగా 48  కేసులు, రెండు సార్లు పీడీయాక్టుపై జైలుకు వెళ్లి వచ్చినా తన తీరు మార్చుకోకపోగా పదే పదే నేరాలకు పాల్పడుతున్న మౌలాలికి ముస్లింజంగ్‌కు చెందిన రౌడీషీటర్‌ మహ్మద్‌ ముక్రం అలియాస్‌ పప్పును ఆదివారం పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు. డీఐ జగదీశ్వర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముస్లీంగంజ్‌కు చెందిన రౌడీషీటర్‌ పప్పుపై మల్కాజిగిరి, నేరెడ్‌మెట్, కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు కేసులు ఉన్నాయి. రెండుసార్లు పీడీయాక్టుపై జైలుకు వెళ్లి వచ్చాడు. చివరగా గత నవంబర్‌ నెలలో హోటల్‌ యజమానిని కత్తితో బెదిరించి డబ్బులు లాక్కెళ్లిన ఘటనలో పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల జైలునుంచి బయటికి వచ్చిన ముక్రం ఈ నెల 9న మౌలాలిలోని ఓ రెడీమేడ్‌ బట్టల దుకాణానికి వెళ్లి సేల్స్‌ బాయ్‌ని బెదిరించి రూ.2 వేల విలువైన దుస్తులు తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి ఏ1 హోటల్‌లో ఓ వ్యక్తిని బెదిరించి రూ.2500 నగదు లాక్కెళ్లాడు. బట్టల దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం రాత్రి ముక్రంను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు