భద్రతాబలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల మృతి

21 Oct, 2018 12:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శ్రీనగర్‌(జమ్మూ కశ్మీర్‌): కుల్లాం జిల్లా లారో ప్రాంతంలో మరోసారి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నారని భద్రతా బలగాలకు సమాచారం రావడంతో సంఘటనాస్థలానికి వచ్చి సెర్చ్‌ ఆపరేషన్‌ చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఇద్దరు జవానులు గాయపడ్డారు.

ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపేశారు. సంఘటనాస్థలం నుంచి ఏకే-47, అండర్‌ బారెల్‌ గ్రెనేడ్‌ లాంచర్‌, మూడు గ్రెనేడ్‌లు, రెండు చైనా పిస్టళ్లు, మరికొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెల్సిందే.
 

మరిన్ని వార్తలు