పాములపాడు : మండల పరిధిలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి సోమవారం 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు సీఈ శివరామ్ప్రసాద్ తెలిపారు. అలాగే ఎస్సార్బీసీకి 1800 క్యూసెక్కులు, కెసీసీకి 700, టీజీపీకి 1500 క్యూసెక్కుల చొప్పున దిగువకు వదిలామన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి ఎస్సార్ఎంసీ దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.