క్యారీబ్యాగ్స్‌పై నిషేధం

7 Aug, 2016 10:20 IST|Sakshi
క్యారీబ్యాగ్స్‌పై నిషేధం
విజయవాడ సెంట్రల్‌ : 
పర్యావరణం దృష్ట్యా నగరంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ క్యారీబ్యాగ్స్‌ను నిషేధించినట్లు కమిషనర్‌ జి.వీరపాండియన్‌ చెప్పారు. ప్లాస్టిక్‌ కవర్ల వల్ల భూగర్భజలాలు అడుగంటుతున్నాయన్నారు. షాపుల యజమానులు, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రజారోగ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. నగరంలో పశువులు రోడ్లపై తిరగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. రోడ్లపై కనిపించే పశువుల్ని బందిలిదొడ్డికి తరలిస్తామని హెచ్చరించారు.
 
మరిన్ని వార్తలు