- అరగంటపాటు అంతరాయం
కర్నూలు(హాస్పిటల్): పెద్దాస్పత్రిలో విద్యుత్ అంతరాయం కొనసాగుతూనే ఉంది. గత నెల నుంచి 21వ తేదీ నుంచి ఈ సమస్య ఆసుపత్రిని వెన్నాడుతోంది. సోమవారం ఉదయం సైతం విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఆసుపత్రిలోని పవర్ కంట్రోల్రూం వద్ద ఉదయం 10 గంటల సమయంలో ఫీజు పోయింది. దీంతో బూత్బంగ్లా, సూపర్స్పెషాలిటీ విభాగాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. కేవలం ఐసీయూ, ఓటీలకు మాత్రమే విద్యుత్ సరఫరా జరిగింది. అరగంట పాటు విద్యుత్ పోవడంతో మళ్లీ ఏదైనా సమస్య తలెత్తిందా అన్న ఆందోళన వైద్యులు, స్టాఫ్నర్సుల్లో నెలకొంది. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సమస్యను గుర్తించి.. పరిష్కరించారు. దీంతో వైద్యులు, రోగులు ఊపిరిపీల్చుకున్నారు.