కారు బోల్తా: టీపీసీసీ నాయకుడికి గాయాలు

4 Jun, 2016 17:15 IST|Sakshi
కారు బోల్తా: టీపీసీసీ నాయకుడికి గాయాలు

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నగర్ మండలం బాన్సువాడ క్రాస్ రోడ్డు వద్ద శనివారం టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్కుమార్ గౌడ్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... మహేష్కుమార్ను కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ విషయం తెలిసిన తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఆసుపత్రికి చేరుకుని... మహేష్కుమార్ను పరామర్శించారు.

మరిన్ని వార్తలు