వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌గా గీత

12 Sep, 2016 23:08 IST|Sakshi
వరంగల్‌ బిజినెస్‌ : వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనర్‌గా గీత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన హరిత పంజాగుట్ట డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
 
ఈ సందర్భంగా గీతను తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ మూజాహిద్‌ హూస్సేన్‌ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు గోపి కిశోర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌, ,శ్రీనివాస్‌, మహ్మద్‌ ఇబ్రహీం హుస్సేన్‌, మూజిబ్‌, ప్రవీణ్‌, రమేష్‌, మసూద్‌, శర్మ, జగదీష్‌, అయ్యూబ్‌, హబీబ్‌, అరుణ, నాగమణి, సుమలత, వినయ్‌ ఉన్నారు.  
 
మరిన్ని వార్తలు