పార్టీ ఫిరాయింపులపై జనచైతన్య వేదిక సదస్సు

19 Jun, 2016 11:41 IST|Sakshi

విజయవాడ: ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మంచినీళ్లు తాగినంత సులభంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారుతున్నారు. ఈ నేపథ్యంలో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ఎంబీ భవన్లో 'పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం' అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి సదస్సును ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్రావు, ప్రొఫెసర్లు నూర్బాషా, రంగయ్య, రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు అంజిరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
 

మరిన్ని వార్తలు